నిండుగా ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అవడంతో కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ
Oct 17 2013 12:33 AM | Updated on Mar 28 2018 10:56 AM
తాండూరు టౌన్, న్యూస్లైన్: నిండుగా ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అవడంతో కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన ఆల్ మహారాష్ట్ర ట్రాన్స్పోర్టు యజమాని గోపాలకృష్ణ స్థానిక మాధుర్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గోడౌన్ నుంచి నాలుగురోజుల క్రితం ఓ గ్యాస్ సిలిండర్ను తీసుకువచ్చాడు. మూడు రోజులుగా ఇంట్లో వాసన వస్తోందని కుటుంబీకులు పసిగట్టారు. ఏదో జంతు కళేబరం అయి ఉండొచ్చని భావించి మిన్నకుండిపోయారు. బుధవారం వరండాలో ఉన్న గ్యాస్ సిలిండర్ను పరీక్షించగా సిలిండర్ మధ్య భాగంలోని అతుకు వద్ద నుంచి గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురై సిలిండర్ను ఇంటికి దూరంగా పడేవారు. కాగా గతంలో కూడా సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. సిలిండర్ లీకేజీని గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని గోపాలకృష్ణ కుటుంబీకులు గ్యాస్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement