ధారూరు: హైదరాబాద్–తాండూర్ ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ బస్లో మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ గొడవ ధారూరు పోలీస్స్టేషన్కు చేరింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బస్సు వికారాబాద్కు చేరుకోగా ధారూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు. కాగా బస్సులో తాండూర్కు వెళుతున్న ఓ ప్రయాణికురాలితో పంచాయితీ ఏర్పడింది.
సీటులో చిన్న పిల్లను తీసుకుని సీటు ఇవ్వాలని అల్లిపూర్ మహిళలు కోరారు. ఇందుకు ఆమె నేను ఇవ్వనంటూ గొడవపడింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో డ్రైవర్ నేరుగా బస్సును ధారూరు ఠాణాకు తీసుకెళ్లారు. బస్సు ఆపగానే తాండూర్కు చెందిన మహిళ బస్సులోంచి కిందకు దిగి పరుగుపెట్టింది. దీంతో పోలీసులు అల్లిపూర్ మహిళలకు సర్దిచెప్పి పంపించారు. గొడవ సద్దుమణగడంతో బస్సు తాండూర్కు వెళ్లింది.


