చిలకలగడ్డ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం
Jul 12 2017 11:54 AM | Updated on Sep 19 2019 2:50 PM
విశాఖపట్నం: చిలకలగడ్డ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి విలువైన వంద కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఒక లారీని, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్. కోట మండలం బొడ్డవార జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4 వేల కేజీలు ఉంటుందని అనుమానం. నిందుతులు పరారీలో ఉన్నారు.
Advertisement
Advertisement