కార్పొరేట్ పాఠశాలల్లో ఫర్నిచర్ ధ్వంసం


గుంతకల్: కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పెద్ద ఎత్తున డొనేషన్లు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు కార్పొరేట్ పాఠశాలల్లోకి విద్యార్థి నాయకులు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top