* ‘రుణమాఫీ’పై చేతులెత్తేసిన సుజనా చౌదరి కమిటీ
* కనీసం రెండు నెలల సమయం పడుతుందని వెల్లడి
* రేపు బ్యాంకుల సీఎండీలతో ముఖ్యమంత్రి భేటీ
* రూ.6 వేల కోట్ల వరకు చెల్లింపు ప్రతిపాదన!
సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీకి నిధుల సేకరణపై సుజనా చౌదరి కమిటీ చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రుణ మాఫీకి అవసరమైన నిధులు సేకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. రెండురోజుల క్రితం ఈ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నిధుల సేకరణకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధుల సమీకరణ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, కనీసం రెండు నెలల సమయం పడుతుందని కమిటీ చెప్పింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీకి బడ్జెట్ నుంచి రూ.4,250 కోట్లు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో తెలంగాణ సర్కారు బాటలోనే పయనించాలని నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా బ్యాంకుల సీఎండీలతో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో సీఎం కూడా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
రైతుల వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం అనుసరించనున్న విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపా రు. బడ్జెట్లో రుణ మాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినందున ఈ ఏడాది ఆ మేరకు లేదా అదనంగా మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని, బ్యాంకులు రైతులందరి రుణాలను రెన్యువల్ చేయూలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు తెలిపారు. ఇలా ఏడాదికి కొంత మొత్తం చొప్పున నాలుగేళ్ల కాలంలో మొత్తం చెల్లిస్తామని పేర్కొననున్నారు. పంటల బీమా గడువుతో పాటు ఖరీఫ్ సీజన్ పూర్తిగా ముగిసిన తరువాత ఇప్పుడు ఎంతో కొంత చెల్లిస్తామనడం.. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రుణ మాఫీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్కు ఐదు నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్ ఆదాయాన్ని మళ్లిస్తామని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్కు బ్యాంకులు ఎంతవరకు అప్పులు ఇవ్వగలవో చెప్పాలని కూడా ప్రభుత్వం కోరనుంది. ఈ విషయంలో బ్యాంకులు నుంచి వచ్చే స్పందన ఆధారంగానే కార్పొరేషన్ ఏర్పాటుపై ముందడుగు వేయాలని నిర్ణరుుంచింది.
ప్రణాళికేతర వ్యయంలో కోత వీలుకాదు!
రైతుల రుణ బకాయిల్లో ఎంతో కొంత మొత్తం బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నందున ప్రణాళికేతర వ్యయంలో 15 శాతం మేర కోత విధించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ అం శంపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రణాళికేతర పద్దులో విద్యుత్ , బియ్యం సబ్సిడీలతో పాటు సామాజిక పింఛన్లు, ఉద్యోగుల జీత భత్యాలు, స్కాలర్షిప్లు, ఫీజు రీరుుంబర్స్మెంట్ వంటివి ఉన్నాయని, ఈ రంగాలకే సరిపడా కేటాయింపులు చేయనందున ఇప్పుడు కోతలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
నిధుల సేకరణ వెంటనే సాధ్యం కాదు
Published Sun, Sep 28 2014 3:25 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండ్రోజులు వర్ష సూచన
యువత చేతుల్లోనే దేశ పాలన
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొను‘గోల్’.. జాప్యం
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement