విశాఖ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది.
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.పాఠశాల సిబ్బంది వారిని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.