విశాఖ నగర సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం రాత్రి ఓ కంపెనీ యూనిట్లో ప్రమాదం జరిగింది.
పరవాడ (విశాఖపట్నం): విశాఖ నగర సమీపంలోని పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం రాత్రి ఓ కంపెనీ యూనిట్లో ప్రమాదం జరిగింది. గ్రాన్యూల్స్ ఆస్టాస్ కంపెనీ తయారీ యూనిట్లో బాయిలర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.