అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం | fire accident in kurnool district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం

Dec 22 2015 12:35 PM | Updated on Sep 5 2018 9:45 PM

వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని రెండిళ్లు కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది.

కొత్తపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని రెండిళ్లు కాలిపోయిన ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పైడిమాను పక్కీరయ్య కుటుంబసభ్యులు ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేసే యత్నంలో పొయ్యిలో కిరోసిన్ చల్లారు.

అయితే, ఒక్కసారిగా మంటలు లేచి ఇంటి పైకప్పుకు అంటుకున్నాయి. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్నాయి. రెండిళ్లలో ఉన్న ధాన్యం, దుస్తులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆర్‌ఐ అపర్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement