అనంతపురం జిల్లా వజ్రకరూరులో దారుణం

Father Kills His Daughter in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : రోజు రోజుకు మనుషులలోని మానవత్వం మంటగలిసి పోతుంది. కూతురి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కన్న తండ్రే చిన్నారిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘోర ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎర్రిసామి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో వికలాగురాలైన తన ఆరేళ్ల చిన్నారిని అతి కిరాతంగా కొట్టి చంపాడు. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top