విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 24 2015 3:18 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ధర్మాపురం మండలం నగరం గ్రామంలో సోమవారం జరిగింది.

ధర్మాపురం (కర్నూలు) : విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ధర్మాపురం మండలం నగరం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. నగరం గ్రామానికి చెందిన మేడిచెట్టు రాజలింగం(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అయితే పక్కనే ఉన్న మరో రైతు మొక్కజొన్న పంటను అడవిపందుల బారి నుంచి కాపాడుకోవడానికి విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు.

కాగా ఉదయం బావి వద్దకు వెళ్లిన రాజలింగానికి ప్రమాదవశాత్తూ ఆ తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement