కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ రైతు చనిపోయాడు.
మద్దికెర (కర్నూలు) : కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ రైతు చనిపోయాడు. మండలంలోని పెరవలి గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య(62) గురువారం మధ్యాహ్నం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మోటారు బోరు కోసం వేసిన కరెంటు తీగ తగిలింది. షాక్తో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.