జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతాం | Sakshi
Sakshi News home page

జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతాం

Published Tue, Aug 26 2014 11:54 AM

Enquiry on jalayagnam irregularities, says Devineni Umamaheswara rao

హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అలాగే జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. జలయజ్ఞంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లతోపాటు తోటపల్లి బ్యారేజ్ ఆయకట్టుపై సదరు మంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా దేవినేని ఉమాపై విధంగా స్పందించారు.

Advertisement
Advertisement