రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అధికార టిడిపి వారు తలచుకుంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడగలరని మరోసారి రుజువైంది.
విజయనగరం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అధికార టిడిపి వారు తలచుకుంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడగలరని మరోసారి రుజువైంది. కొందరు అధికారులు కూడా వారి తొత్తుల్లా వ్యవహరిస్తారనేది స్పష్టమైపోయింది. జిల్లాలోని మత్స్యకార సొసైటీ సంఘానికి ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉంది. అయితే ఈ సొసైటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయించారు. ఏకంగా ఎన్నికలు నిర్వహించవలసిన అధికారే గౌర్హాజరయ్యారు. దాంతో ఎన్నికలను వాయిదా వేశారు.
ఎన్నికల వాయిదాకు గంగపుత్రులు నిరసన తెలిపారు. వారు ఆందోళనకు దిగారు. మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది.