జేఎన్టీయూ (విజయనగరం రూరల్), న్యూస్లైన్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం విజయనగరం క్యాంపస్లో సోమవారం నిర్వహించిన ఎడ్సెట్-13 కౌన్సెలింగ్కు 96 మంది హాజరయ్యారు.
ఎడ్సెట్ కౌన్సెలింగ్కు 96 మంది హాజరు
Oct 1 2013 4:19 AM | Updated on Sep 1 2017 11:12 PM
జేఎన్టీయూ (విజయనగరం రూరల్), న్యూస్లైన్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం విజయనగరం క్యాంపస్లో సోమవారం నిర్వహించిన ఎడ్సెట్-13 కౌన్సెలింగ్కు 96 మంది హాజరయ్యారు. రెండో రోజు నిర్వహించిన గణితం సబ్జెక్టులో12001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్కు హాజరైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించామని ఎడ్సెట్ హెల్ప్లైన్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.బాలాజీ తెలిపారు.
అలాగే మంగళవారం ఫిజిక్స్, ఆంగ్లం సబ్జెక్టులకు సంబంధించి ర్యాంకర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రెండు సబ్జెక్టులకు ఒకటి నుంచి ఆఖరి ర్యాంకు వరకు ఒక్కరోజే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే మూ డు, నాలుగు తేదీల్లో బయాలాజికల్ సైన్స్కు, 5, 6, 7 తేదీల్లో సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Advertisement
Advertisement