పనితీరు పాయింట్ల కేటాయింపుపై వ్యక్తమతున్న భిన్నాభిప్రాయాలు
ఇలాగైతే నష్టపోతామంటున్న టీచర్ సంఘాల ప్రతినిధులు
మురళీనగర్(విశాఖ): ఉపాధ్యాయుల బదిలీలలకు సంబంధించి విడుదలైన షెడ్యూలుపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేసినప్పటికి పనితీరుకు సంబంధించి పాయింట్ల కేటాయింపుపై వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగుపై ఏకాభిప్రాయం కుదిరినా పాయింట్ల కేటాయింపులో పారదర్శకత, స్పష్టతపై సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంఘ ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలివీ!
దాతల సాయంతో పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ చేసిన వారికి పాయిట్ల కేటాయింపు అనేది బోధనకు ప్రాధాన్యతనిచ్చే ఉపాధాయునికి చేతకాకపోవచ్చు ఇలాంట ప్పుడు ఆ ఉపాధ్యాయుడు పాయింటుల నష్టపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిధుల సమీకరణ సాధ్యం కాదు.
హాజరు శాతంకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ప్రసూతి సెలవులు, పురుష ఉపాధ్యాయులు పెటర్నటీ లీవ్, ఉన్నత విద్యార్హతల కోసం లాంగ్ లీవ్ వాడుకునే వారు నష్టపోవాల్సిందేనా?పదోతరగతిలో ఫలితాల ఆధారంగా పాయింట్లు కేటాయింపు అనేది తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకే న్యాయం జరుగుతుంది. వందమందికి పైగా పదోతరగతి పరీక్షలు రాసిన పాఠశాలలో ఒక్కరు పరీక్ష తప్పినా ఎక్కువ శాతం పడిపోతుంది. ఒక సబ్జెక్టులో విద్యార్థి పరీక్ష తప్పితే అది ఇతర సబ్జెక్టు ఉపాధాయులపై ప్రభావం పడుతుంది.
పదోతరగతి బోధించని ఉపాధ్యాల మాటేమిటి?
అవార్డులు పొందిన వారికి పాయింట్లు కేటాయించడం వల్ల జూనియర్లకు అన్యాయం జరుగుతుంది. గతంలో జాతీయ పురస్కారానికి 15పాయింట్లు, రాష్ట్ర అవార్డుకు 10మార్కులు కేటాయించేవారు. ఇప్పుడు అన్నిటికి ఒకే విధంగా 5పాయింట్లు ఇస్తామంటున్నారు.
పిల్లల నమోదుపెరుగుదలకు సంబంధించి పాఠశాల వయసుగల పిల్లలు తగ్గిపోతున్న ఆవాసప్రాంతాల పరిస్థితి ఏమిటి?గతేడాది 3,5,8తరగతుల్లో ఎ, ఎ-ప్లస్, శ్రేణుల్లో 80శాతం ఉత్తీర్ణత సాదించిన పిల్లలు ఉంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉత్తీర్ణత శాతం ఆధారపడి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయకుండా పాయింట్లు నిర్ధారణ ఎలా చేస్తారనేది సందేహమే.ఉపాధాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే అదనంగా పాయింట్లు ఇస్తామంటున్నారు. ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాల స్థాయిలో అభ్యసించడానికి పిల్లలు లేనివారు నష్టపోతారు.
పాఠశాలల్లో పీఈటీలు, క్రీడా మైదానాలు లేకుండా ఈ విభాగంలో పాయింట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంది.పాయింట్ల కేటాయింపులో సవరణ లు చేసి మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టి మెజార్టీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వైఎస్సార్ టిఎఫ్, ఏపీటిఎఫ్(1938) సంఘాల జిల్లా అధ్యక్షులు చిరికి శ్రీనివాసరావు,ఎం.జే.సేవియర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము విద్యాశాఖ కార్యదర్శికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు.
బదిలీల్లో ఇదేం పాయింటు..
Published Tue, Sep 1 2015 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement