డూప్లి‘కేటు’ ఎస్‌ఏలకు ఉచ్చు | Dupli 'ketu' trap SA | Sakshi
Sakshi News home page

డూప్లి‘కేటు’ ఎస్‌ఏలకు ఉచ్చు

Oct 22 2013 6:04 AM | Updated on Jul 26 2018 1:37 PM

నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) లుగా పదోన్నతి పొందిన కొందరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు ఉచ్చు బిగుసుకుంటోంది.

 

=ఓ వైపు సీబీసీఐడీ.. మరోవైపు లోకాయుక్త
 = పూర్తిస్థాయి వివరాల కోసం విద్యాశాఖ అధికారుల కసరత్తు
 =ఎస్జీటీలుగా మారనున్న సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు

 
ఖమ్మం, న్యూస్‌లైన్: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) లుగా పదోన్నతి పొందిన కొందరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు ఉచ్చు బిగుసుకుంటోంది. ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడిన’ చందంగా వారి పరిస్థితి తయారవుతోంది. 2009లో ఇంగ్లిష్ ఎస్‌ఏలుగా పదోన్నతి పొందిన వారిలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన  వారికి రివర్షన్ త ప్పదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

తప్పును కప్పిపుచ్చుతూ ఇంతకాలం విధులు నిర్వహిస్తున్న సంబంధిత ఇంగ్లిష్ టీచర్ల వ్యవహారంపై ఓవైపు లోకాయుక్త, మరోవైపు సీబీసీఐడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ విచారణతో తమ గు ట్టు ఎక్కడర ట్టవుతుందోనని సంబంధిత ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. తమ సర్టిఫికె ట్లు నకిలీవని తేలితే శిక్షతో పాటు పరువు గం గలో కలుస్తుందని ఆందోళన చెందుతున్నారు.  
 
2009తో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించారు. ఎస్జీటీలుగా ఉన్నవారికి సీనియార్టి, అదనపు అర్హతల ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో రాష్ట్రవ్యాప్తంగా 2,650 మంది, జిల్లాలో 80 మందికి పైగా నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రమోషన్ పొందారని పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వినాయక మిషన్ యూనివర్సిటీ అండ్ రిసెర్చ్ నుంచి 35 మంది, మనోవినం సందర్‌నార్ విశ్వవిద్యాలయం నుంచి పది మంది, కువ్వెంపు యూనివర్సిటీ నుంచి 27 మంది, ఓ ఇద్దరు ఇగ్నో, 15 మంది ఉస్మానియా, నలుగురు కాకతీయ, ఒక్కరు నాగార్జున యూనివర్సిటీల నుంచి తెలుగు, ఇంగ్లిష్ పీజీ, బీఎడ్ సర్టిఫికెట్లు సమర్పించి ఎస్‌ఏలుగా పదోన్నతి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి క మిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూనం మాలకొండయ్య స్పందించారు. 14 అంశాలతో ఆర్‌సీ నంబర్ 09/డి1/డి2/2009, తేదీ 31.03.2010 పేరిట ఆర్డర్ జారీ చేసి 9.4.2010న సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులను పంపించారు.
 
విచారణ ముమ్మరం..

 అడ్డదారిలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల భరతం పట్టేందుకు ఓవైపు సీబీసీఐడీ, మరోవైపు లోకాయుక్త కసరత్తు ప్రారంభించింది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి విద్యాశాఖనే బురడి కొట్టించారని ‘ఒరిజనల్ టీచర్స్ అధికారులు’ లోకాయుక్తతోపాటు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు. జిల్లాలో పలువురు అధికారులు వారికి వత్తాసు పలికి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని, ఇలా అయితే నిజాలు తేలవని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ విచారణ చేపట్టాల్సిందిగా సీబీసీఐడీని కోరింది.

ఈ మేరకు రంగంలోకి దిగిన సీబీసీఐడీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి పూర్తివివరాలు తెప్పించుకున్నారు. జిల్లాలో 66 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. మరోవైపు లోకాయుక్త కూడా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన పూనం మాలకొండయ్య సూచించిన 14 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, డిప్యూటీ డీఈఓల ద్వారా సేకరించిన  విచారణ రిపోర్టును అందజేయాలని లోకాయుక్త ఆదేశించింది.

ఆ నివేదికలో సూచించిన విధంగా స్టడీ సెంటర్ల నిర్వహణ, ఒకే సంవత్సరంలో పీజీ పూర్తిచేయడం, యూనివర్సిటీ మార్కుల జాబితా వివరాలను అధికారులు పరిశీలించారు. డెక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యూనివర్సిటీల సర్టిఫికెట్లు, పరీక్షల సమయంలో సెలవుపెట్టకుండా ఎగ్జామ్స్ ఎలా రాశారని, సంవత్సరకాలంలో రెండు డిగ్రీలు ఎలా పొందారనే వివరాలతో జిల్లా అధికారులకు ఫైల్ పంపించారు. నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందిన వార్ని ఇంతకాలం కాపాడుతూ వచ్చిన జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు ఇప్పుడు చేతులు ఎత్తివేసినట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదికలు అందజేయక తప్పదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయి నివేదికలతో తమ ఉద్యోగులను మంగళవారం హైదరాబాద్ పంపించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి పాతఫైల్స్‌ను బూజుదులిపే పనిలో ఉన్నారు. నకి‘లీలలు’ బయటకొస్తే ఎస్‌ఏలుగా పొందిన అదనపు వేతనంతో పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement