ఆస్తి కోసం కొట్లాట | disuptes raise for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కొట్లాట

Mar 26 2015 8:40 PM | Updated on Sep 2 2017 11:26 PM

ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే కొట్లాటకు దిగిన సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బోయపొంతిరాళ్లలో గురువారం చోటుచేసుకుంది.

కర్నూలు(కృష్ణగిరి): ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే కొట్లాటకు దిగిన సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బోయపొంతిరాళ్లలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగన్న, లక్ష్మణ్ అనే అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ఆస్తికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు తాగాదాలు పెట్టుకున్న అన్నదమ్ములు ఈ రోజు కొట్లాటకు దిగారు.

కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో రాజన్న కుమారులు భాస్కర్, రామంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని డోన్ ఆస్పత్రి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement