
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఉచిత గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.50, రూ.100, రూ.500 ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 4, ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు, రూ.500 గదులు- ఖాళీ లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 101
సహస్ర దీపాలంకరణసేవ - 57 ఖాళీ.
వసంతోత్సవం - ఖాళీ లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం