'అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి' | cpi leaders protests palle raghunatha reddy house in anantapur | Sakshi
Sakshi News home page

'అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి'

Mar 22 2015 11:25 AM | Updated on Aug 13 2018 4:30 PM

అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు సర్కార్ను సీపీఐ నేత కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు సర్కార్ను సీపీఐ నేత కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి నివాసాన్ని కె.రామకృష్ణ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లాలో కరువు రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement