జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా | Court adjourns hearing on YS Jaganmohan Reddy's petition | Sakshi
Sakshi News home page

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా

Oct 18 2013 10:18 PM | Updated on Sep 27 2018 5:12 PM

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా - Sakshi

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.

ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement