ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు | Corona Positive Case Registered In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు

Apr 3 2020 10:57 PM | Updated on Apr 3 2020 11:29 PM

Corona Positive Case Registered In Visakhapatnam - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 1 నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 164కు చేరుకుంది. క​రోనా నుంచి కోలుకున్న ఇద్దరిని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒంగోలు, రాజమండ్రిలో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. మొత్తం ఇప్పటి వరకు నలుగురు బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement