అనపర్తిలో కరోనా కేసు.. అధికారులు అప్రమత్తం | Corona Positive Case Registered In Anaparthi | Sakshi
Sakshi News home page

తూర్పును వెంటాడుతున్న కరోనా

Jun 2 2020 11:34 AM | Updated on Jun 2 2020 11:40 AM

Corona Positive Case Registered In Anaparthi - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అనపర్తిలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్‌మెంట్‌‌ ఏర్పాటు చేసి పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వీధులను మూసివేశారు. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 273కు చేరుకుంది. పెదపూడి మండలం గొల్లలమామిడాడలో కరోనా కేసుల ఉధృతి ఆగడం లేదు. సోమవారం ఒక్కరోజే ఆ గ్రామంలో 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గొల్లలమామిడాడలో కరోనా బారినపడివారి సంఖ్య 113కు చేరుకుంది. పెద్దాడ, గండ్రేడు, రాజపాలెం గ్రామంలో  ఒక్కొక్కటి చొప్పున నమోదు అయ్యాయి. మండలంలో కేసుల సంఖ్య 116కు చేరుకున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంటాక్ట్‌ వ్యక్తుల వివరాలు సేకరించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement