18న కర్నూలుకు సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఖరారు | CM YS Jagan Kurnool District Tour Schedule | Sakshi
Sakshi News home page

18న కర్నూలుకు సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఖరారు

Feb 16 2020 7:47 PM | Updated on Feb 16 2020 8:38 PM

CM YS Jagan Kurnool District Tour Schedule  - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
 ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు
అక్కడ నుంచి  10.30 నిమిషాలకు ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని హెలీకాఫ్టర్‌లో కర్నూలు ఎస్‌ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్‌లో సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్‌ అధికారులను సత్కరించనున్నారు.
11.20 నిమిషాలకు  బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
12.50 నిమిషాలకు ఎస్టీబీసీ గ్రౌండ్‌ నుంచి బయలుదేరి ఎస్‌ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
1.20 నిమిషాలకు ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి విమానంలో 2.30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని సీఎం తన నివాసానికి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement