
శిల్పాతో ఇంకెవరైనా వెళతారా?
తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా కర్నూలు జిల్లా కీలక నేత శిల్పా మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్లో
మంగళవారం ఉదయం కూడా మరోసారి అఖిలప్రియ, మంత్రులు అచ్చెంనాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శిల్పాతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీని వీడతారని ఆయన నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. వారి వివరాలు తెలుసుకుని పార్టీని వదిలి వెళ్లకుండా చూడాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళితే ఏర్పడే ఇబ్బందులు, ఇతర అంశాలను వివరించా లని సూచించారు. పార్టీ శ్రేణుల్ని కూడా జారిపోకుండా చూడాలని కోరారు. శిల్పా వైఎస్సార్సీపీలో చేరడం వల్ల టీడీపీకి నష్టం ఉండదని ప్రచారం చేయాలని, ముఖ్య నాయకులు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని సూచించారు.
ప్రస్తుత పరిణామాలపై అఖిలప్రియను వివరణ కోరగా... ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయినా శిల్పా పార్టీని వీడితే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లాలో చాలా ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించి నేతలందరితోనూ సీఎం మాట్లాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపైనా వారితో చర్చించి వెంటనే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులన్నిం టినీ వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ఇంకా ఏమేం పనులు చేయాలో ప్రణాళిక తయారు చేసుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 21వ తేదీన తాను నంద్యాలలో పర్యటిస్తానని తెలిపారు. అదేరోజు పట్టణ గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.