రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి | clash between two groups in munimadugu village | Sakshi
Sakshi News home page

రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి

Sep 21 2015 10:21 AM | Updated on Sep 3 2017 9:44 AM

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది.

ప్యాపిలి: రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో నాసిర్ బాషా అనే వ్యక్తి మృతి చెందాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

అయితే, ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన కంబగిరిస్వామి (42) ప్రాణాలు కాపాడుకునేందుకు కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. అనంతరం ఇంటికి చేరిన ఆయన ఈ మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.

పాత కక్షల కారణంగానే గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు. రెండు వర్గాల ఘర్షణతో మునిమడుగు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి పరిస్థితి అదుపు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement