సోనియాకు చిరంజీవి వినతి
రాజీనామా చేయాలన్న అశోక్ బాబుపై ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో తాము ఇప్పటికే పరీక్ష రాశామని, అందులో పాసా, ఫెయిలా అనేది త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి శనివారం వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషిచేశామని, మంత్రి పదవులను కూడా త్యజించామని చెప్పారు. రాష్ట్ర విభ జన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపథ్యంలో సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడని విషయం తెలిసిందే. దాంతో శనివారం మరోమారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా అపాయింట్మెంట్ కోరారు. కేంద్ర మంత్రులను బృందంగా కలిసేందుకు నిరాకరించిన సోనియా, చిరంజీవికి మాత్రం ఐదు నిమిషాల సమయం ఇచ్చారు. ఈ సమయంలోనే విభజన విషయంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చిరంజీవి సోనియా ముందుంచారు. విభజనకు తామంతా అంగీకరిస్తున్నామని, హైదరాబాద్ను అసెంబ్లీతో కూడిన శాశ్వత యూటీ చేయాలని కోరారు. అలా వీలుకాని పక్షంలో సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకైనా హైదరాబాద్ను యూటీ చేయాలని కోరారు. చిరంజీవి చెప్పిన అన్ని అంశాలను విన్న సోనియా, పరిశీలిస్తామని చెప్పి పంపినట్లుగా తెలిసింది. ఈ భేటీ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. విభజన అనివార్యమని తెలుస్తున్న పరిస్థితుల్లో సీమాంధ్రుల భద్రత దృష్ట్యా హైదరాబాద్లోని హెచ్ఎండీఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం మంచిదని సోనియాకు విన్నవించానన్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని, 1956 పూర్వస్థితినే కొనసాగించాలని కోరానన్నారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా పదవులకు రాజీనామాలు చేశామని, అశోక్బాబు ఉద్యోగానికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.
శాశ్వత యూటీగా హైదరాబాద్
Published Sun, Dec 1 2013 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement