
వెట్టిచాకిరి నుంచి బాలికకు విముక్తి
వెట్టిచాకిరి నుంచి ఏడేళ్ల బాలికకు విముక్తి లభించింది. పోతునూరు జెడ్పీ హైస్కూల్లో అటెం డర్గా పనిచేస్తున్న కాశీ తాడేపల్లిగూడెం శివారు కొండాలమ్మ గుడి
ఏలూరు (టూ టౌన్)/పెదవేగి రూరల్ : వెట్టిచాకిరి నుంచి ఏడేళ్ల బాలికకు విముక్తి లభించింది. పోతునూరు జెడ్పీ హైస్కూల్లో అటెం డర్గా పనిచేస్తున్న కాశీ తాడేపల్లిగూడెం శివారు కొండాలమ్మ గుడి సమీపంలో జ్యోతి అనే బాలికతో వెట్టిచాకిరి చేయిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్న విషయాన్ని సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఇంటిగ్రేడెట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) అధికారులకు చెప్ప డంతో వారు బాలికను విడిపించి ఏలూరులోని కరుణాలయ ఎన్జీవో హోంకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు లేని జ్యోతి అనే బాలికను ఆమె మేనత్త కాళిదాసు లక్ష్మి డబ్బు కోసం బ్యూటీపార్లర్లో పనిలో పెట్టింది. బ్యూటీపార్లర్ నిర్వాహకులు ఆ బాలికతో వెట్టిచాకిరి చేయిస్తోంది.
ఓసారి టీవీ చూసిందన్న కోపంతో వంటిపై వాతలు పెట్టింది. ఈ బాధల్ని భరించలేని బాలిక పనిలోకి వెళ్లనని చెప్పడంతో మేనత్త సైతం తన కంటిపై కొట్టి, పొట్టపై వాతలు పెట్టిందని బాలిక రోదిస్తూ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు చెప్పింది. తన మేనత్త వాళ్ల పిల్లలను ఎత్తుకోలేదన్న సాకుతో కూడా తరుచూ కొట్టేదని ఆ బాధలు భరించలేక బ్యూటీపార్లర్కి వెళితే అక్కడ కారం, పచ్చడి కలిపిన అన్నం పెట్టేవారని వాపోయింది. మేనత్తతోపాటు బాలికతో వెట్టిచాకిరి చేయించిన బ్యూటీపార్లర్ నిర్వాహకుల వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
బాలికను ఏలూరులోని కరుణాలయా ఎన్జీవో హోంకు పంపి రక్షణ కల్పిస్తామని బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి తెలిపారు. ఐసీపీఎస్ చైర్మన్ స్నేహన్ మాట్లాడుతూ బాలికలతో పనులు చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రొటెక్షన్ సెల్ అధికారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోతునూరు జిల్లా పరిషత్ హైస్కూల్ అటెండర్ కాశీ, రికార్డు అసిస్టెంట్ రాజేంద్రపసాద్ సహకారంతో బాలికను రక్షించినట్టు తెలిపారు. సంస్థ సభ్యులు లక్ష్మి, పి.విజయనిర్మల, కట్టా సత్యనారాయణ, యు.రాజ్కుమార్ పాల్గొన్నారు.