సీఎస్‌ మహంతి పదవీ కాలం పొడిగింపు | Chief Secretary Prasanna Kumar Mohanty gets extension | Sakshi
Sakshi News home page

సీఎస్‌ మహంతి పదవీ కాలం పొడిగింపు

Feb 28 2014 11:28 PM | Updated on Nov 9 2018 5:52 PM

సీఎస్‌ మహంతి పదవీ కాలం పొడిగింపు - Sakshi

సీఎస్‌ మహంతి పదవీ కాలం పొడిగింపు

రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమార్ మహంతి మరో నాలుగు నెలలపాటు కొనసాగనున్నారు.

హైదరాబాద్:రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమార్ మహంతి మరో నాలుగు నెలలపాటు కొనసాగనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం రాకుండా ఉండాలంటే మహంతినే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 

వాస్తవానికి మహంతి శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ప్రధాని కార్యాలయం మహంతి పదవీకాలాన్ని మూడునెలలపాటు పొడగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రమంత్రి జైరాం రమేష్, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖలోనూ, ప్రధాని కార్యాలయంతోనూ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి మహంతి పదవీ కాలాన్ని జూన్ వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement