ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర | Chhattisgarh landmine blast | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

Nov 6 2014 3:00 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు.

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సీఆర్‌పీఎఫ్ బలగాలు 70 మంది గంగులూరు నుంచి అటవీ ప్రాంతానికి కూంబింగ్‌కు బయలుదేరారు. ఈ రహదారి నుంచి బస్సులో పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చడానికి పథకం రచించారు. అయితే, పోలీసుల బస్సు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు  20 నిమిషాల ముందుగానే పేలింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement