ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు.
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సీఆర్పీఎఫ్ బలగాలు 70 మంది గంగులూరు నుంచి అటవీ ప్రాంతానికి కూంబింగ్కు బయలుదేరారు. ఈ రహదారి నుంచి బస్సులో పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చడానికి పథకం రచించారు. అయితే, పోలీసుల బస్సు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు 20 నిమిషాల ముందుగానే పేలింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.