చెన్నై భవనం కూలిన ఘటనతో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ : చెన్నై భవనం కూలిన ఘటనతో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడినవారికి రూ.50 వేలు, రోజూ కూలీ పని దినాల నష్టానికి కుటుంబానికి రూ.25 వేలు పరిహారంతో పాటు వైద్య సేవల ఖర్చు మొత్తం భరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారానికి 45కి చేరింది. అయిదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.