బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ | Chandrababu meeting with indian business woman in hyderabad | Sakshi
Sakshi News home page

బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ

Nov 15 2014 1:15 PM | Updated on Aug 18 2018 6:18 PM

బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ - Sakshi

బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్తలు నీతూ అంబానీ, పింకీ రెడ్డిలతోపాటు బాలీవుడ్ నటి జూహీచావ్లా శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్తలు నీతూ అంబానీ, పింకీ రెడ్డిలతోపాటు బాలీవుడ్ నటి జూహీచావ్లా శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.11,11,11,111 (11 కోట్లు 11 లక్షల 11 వేల 11 వందల 111 రూపాయిలు) చెక్కును అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల పునర్ నిర్మాణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుపాన్ వల్ల జరిగిన నష్టంతోపాటు జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement