నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం | Sakshi
Sakshi News home page

నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం

Published Sun, Nov 29 2015 12:29 AM

నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం - Sakshi

హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాలశాఖ ఓ లేఖలో పేర్కొంది. శనివారం నాడు విద్యార్థినికి చెక్ ఇచ్చి ఆమెను అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహించనున్న ఇంజినీరింగ్ విద్యార్థి నీలిమ స్వస్థలం గుంటూరు జిల్లా తురకాపాలెం.

నేపాల్ భూకంపం నేపథ్యంలో గతంలో ఆమె చేపట్టిన యాత్ర మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. రెస్క్యూ టీమ్స్ ఆమెను కాపాడటంతో నేపాల్ దుర్ఘటన నుంచి బయటపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో నీలిమ తన యాత్రను ప్రారంభించనుంది. తన ఎవరెస్ట్ యాత్రకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నీలిమ హర్షం వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement