వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.
గంగుల ప్రభాకరరెడ్డిపై కేసు నమోదు
May 8 2014 9:10 PM | Updated on Aug 14 2018 4:24 PM
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కుమార్ రెడ్డిపై గంగుల ప్రభాకరరెడ్డితోపాటు ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈకేసులో గుంగుల ప్రభాకరరెడ్డితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు విజయేంద్రానాథ్రెడ్డి, సుభాష్రెడ్డి, గంగులా విజయసింహారెడ్డిలతోపాటు మరో ఇద్దరి పేర్లను ఈ కేసులో చేర్చారు. కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement