సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఆళ్లగడ్డలోని ఏవీ సుబ్బారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ను అఖిలప్రియ లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను అఖిలప్రియ వర్గీయులు కట్ చేశారు. అఖిలప్రియపై కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందంటూ పత్రాల పంపిణీ చేస్తున్నారు. ఆళ్లగడ్డలో దాదాపు 2000 పైగా ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందంటూ పత్రాల పంపిణీ చేశారు,



