-
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
బాయ్ఫ్రెండ్తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్రూంలో
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్తో చాట్ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన గత గురువారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్ఫోన్ కేబుల్ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్తో అక్క ఫోన్లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది. అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్ హోంకు తరలించినట్టు చెప్పారు. -
బ్లాడర్లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్ఫోన్ కేబుల్ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్ను తొలగించేవారిమని చెప్పారు. -
యాపిల్ ఛార్జింగ్ కేబుల్తో డాటా చోరీ..!
సాన్ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్ని మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్ని వారి డివైజ్కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్ని మీ డివైజ్కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్లోకి హానికరమైన పేలోడ్స్ని వైర్లెస్గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
అక్రమాల పుట్ట..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ నిర్మాణ పనుల కాంట్రాక్టుల రూపకల్పనలో కీలకమైన తెలంగాణ స్టేట్ స్టాండర్డ్స్ రేట్స్(ఎస్ఎస్ఆర్)జాబితా అక్రమాల పుట్టగా మారింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేయకుండా, ఆయా కంపెనీల ఉత్పత్తుల నాణ్యతను ల్యాబ్లో పరీక్షించకుండా వాటికి ధరలు, కేటగిరీలు నిర్ణయించడంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (టీఈసీఏ)ఆరోపించింది. ఇటు గుర్తింపు పొందిన విద్యుత్ కాంట్రాక్టర్లకే కాకుండా ప్రభుత్వానికి నష్టా లు తెచ్చిపెడుతున్న ఈ ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నిజానికి ప్రభుత్వ నిర్మాణాల్లో ఉపయోగించే ఏదైనా వస్తువు నాణ్యతను, ధరలను నిర్ణయించాలంటే నిపుణుల కమిటీ ముందుగా ఆయా వస్తువులను పరీక్షించాలి. అయితే విద్యుత్ వైర్లు, స్విచ్లు, ప్యానల్ బోర్డులు, కాపర్వైర్లు, ఫ్యూజ్లు, ఫ్యాన్లు, ఇంట్లో, వీధుల్లో వెలుగులు విరజిమ్మే ఎల్ఈడీ లైట్లు, స్విచ్గేర్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఏసీ, తదితర విద్యుత్ మెటీరియల్ ఎంపిక, వాటి ధర, నాణ్యతకు సంబంధించిన ఎస్ఎస్ఆర్ జాబితాను చీఫ్ విద్యుత్ తనిఖీ అధికారి(సీఈఐజీ) కాకుండా రహదారులు, భవనాలశాఖ చీఫ్ ఇంజినీర్ రూపొందిస్తుండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కనీసం నిపుణుల కమిటీని సంప్రదించకుండా, మెటీరియల్ను ల్యాబ్లో పరీ క్షించకుండా ఏకపక్షంగా ఎస్ఎస్ఆర్ జాబితాను ఎంపిక చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబందించి ఆర్అండ్బీ విభాగంలో కనీసం టెస్టింగ్ ల్యాబ్ లేకపోయినా విద్యుత్ మెటీరియల్ నాణ్యతతో పాటు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారనే ప్రశ్నకు సంబంధిత అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకే కేటగిరిలో అనేక కంపెనీల ఉత్పత్తులు ఉండటం, వాటిని కాంట్రాక్టర్లు వాడటం వల్ల ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది.నాసిరకం ఉత్పత్తుల కారణంగా ఆయా భవనాల్లో తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరిగి కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపించాలి ప్రభుత్వం చేపట్టే ఏ నిర్మాణ పనుల్లోనైనా ఆర్అండ్బీ రూపొందించిన స్టేట్ స్టాండర్డ్స్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఆయా కంపెనీల విద్యుత్ మెటీరియల్ను వాడాల్సి ఉంది. ఎస్ఎస్ఆర్ జాబితా రూపొందించిన ధరల ప్రకారమే ప్రభుత్వ శాఖలు ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలుస్తాయి. ఎస్ఎస్ఆర్ జాబితాలో 1518 విద్యుత్ వస్తువులు ఉండగా, వీటిని మూడు కేటగిరిలుగా విభజించారు. ఒక్కో కేటగిరిలో 10 నుంచి 15 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను చేర్చారు. ఐటమ్ స్పెసిఫికేషన్ పరిశీలించకుండా వీటిని జాబితాలో చేర్చి, కేటగిరీల వారీగా ధరలు నిర్ణయించడం వల్ల ఏదీ నాణ్యమైనదో? ఏదీ నాసిరకమైనదో తెలియక విద్యుత్ కాంట్రాక్టర్లే కాదు..ఆయా విభాగాల ఇంజినీర్లు సైతం తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన వస్తువులను వాడాల్సి ఉంది. అయితే ఎస్ఎస్ఆర్ జాబితాలో మూడు కేటగిరీలు ఉండటం, ఒక్కో కేటగిరిలో లెక్కకు మించి కంపెనీలు ఉండటం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు సివిల్ కాంట్రాక్టర్లకు 13.61 శాతం ఓవర్హెడ్ కలుపుతూ, రిజిస్టర్డ్ విద్యుత్ కాంట్రాక్టర్లపై వివక్ష చూపుతున్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి.–కందుకూరి శ్రీనివాస్, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ ఏడాది తిరిగేలోపే కేటగిరి మార్పు గతంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే ఎస్ఎస్ఆర్ రూపొందించేవారు. నిర్మాణ పనులతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన పనులు నిర్వహించేవారు. జాబితాలో రూపొందించిన ధరల ప్రకారమే టెండర్ పిలిచేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఏ విభాగానికి ఆ విభాగం ఇంజినీరింగ్ సెక్షన్ను ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకంగా ఇంజినీర్లను నియమించుకుంది. నిజానికి ఏదైనా కంపెనీ మెటీరియల్ ఎస్ఎస్ఆర్ జాబితాలో చేర్చాలన్నా..ధరలను పెంచాలన్నా..తగ్గించాలన్నా..ఆయా విభాగాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత ఐదేళ్లుగా ఎలాంటి చర్చలు, నాణ్యత పరీక్షలు జరుపకుండానే విద్యుత్ వస్తువులను జాబితాలో చేర్చుతుండమే కాదు ఏకంగా వాటిని తొలి కేటగిరిలో చేర్చుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి ధరలను మార్చాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అడిగినంత అప్పగిస్తే చాలూ.. మూడో కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మొదటి కేటగిరిలోకి మార్చడం, మొదటి కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మూడో కేటగిరిలోకి మార్చడం పరిపాటిగా మారింది. ఒకసారి కేటగిరి నిర్ధారించిన తర్వాత అదే కంపెనీకి చెందిన అదే వస్తువుకు ఆ తర్వాతి ఏడాది కేటగిరీల్లో మార్పు ఎందుకు చోటు చేసుకుంటుందో అర్థం కావడం లేదు. –మాజీద్, కార్యదర్శి, టీఈసీఏ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement