సంక్షేమ పథకం అందలేదా..?
94931 56565 నంబర్ను ఫోన్ చేయండి
సమస్యల పరిష్కారం కోసం కాల్సెంటర్
నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం, అవినీతి నిర్మూలన కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులకు అందించేందుకు కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కాల్సెంటర్ను ఆయన ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య అయినా, ఏ సంక్షేమ పథకం అందకపోయినా 94931 56565 నంబర్ను ఫోన్ చేయవచ్చన్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు 100 శాతం అందించాలన్న తలంపుతో ముందుకు పోతున్నామన్నారు. ఇందులో భాగంగా కాల్సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందించేందుకు ఎవరైనా లంచం అడిగినా, బెదిరించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
సంబంధిత వార్తలు