
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రజల సందేహాల నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం కేంద్రీకృత కాల్సెంటర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది.
ఇప్పటికే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ జారీ చేసిన నేపథ్యంలో... ప్రజలు సంబంధిత అధికారుల ద్వారా అవసరమైన సమాచారం తెలుసుకు నేందుకు 9240021456తో ఎస్ఈసీ కార్యాల యంలో కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నిక లకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు ఈ కాల్సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఎస్ఈసీ కార్యదర్శ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.