ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్ /అర్భన్) :దొంగల స్వైర విహారంతో జిల్లావాసులు బెంబేలె త్తిపోతున్నారు. ఒంటరి గా వెళుతున్న మహిళల మెడలో నగలను బైక్లపై దూసుకు వచ్చే చైన్ స్నాచర్లు తెంచుకునిపోతున్నారు. ఎవరైనా వ్యక్తులు భారీ మొత్తంలో నగదు తీసుకు వెళుతుంటే వారిని ఏమార్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. రాత్రీ, పగలు భేదం లేకుండా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఏటీఎంలలో సైతం కన్నాలు వేస్తూ దొంగలు ప్రజలను ఠారెత్తిస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, జీపులు కూడా క్షణాలలో మాయం చేస్తున్నారు. రాత్రి వేళ నగరాలు, పట్టణాల శివార్లు, జాతీ య రహదారులపై వెళుతున్న వాహనాలను అడ్డగించి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరైనా వ్యక్తులు విలువైన ఆస్తులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తెచ్చుకున్న సొమ్ము వాహనాలలో ఉంచితే గద్దల్లా తన్నుకు పోతున్నారు.
ఇంకా కొంచెం తెలివి మీరిన దొంగలు ధనిక వర్గాలకు చెందిన చిన్నారులను, వ్యక్తులను కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో కిడ్నాపర్ల డిమాండ్కు అంగీకరించక పోయినా.. పోలీసులను ఆశ్రయించారని తెలిసినా కిడ్నాప్ చేసిన వ్యక్తులను, చిన్నారులను దారుణంగా చంపేందుకు సైతం వెనుకాడక పోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడునెలల క్రితం జంగారెడ్డిగూడెంలో ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి అతని కుటుంబ సభ్యులను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. నిర్ణీత సమయానికి వారు డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో, నగర శివార్లలో ఉండే గృహాలలో దోపిడీకి పాల్పడే క్రమంలో కొన్ని సందర్భాలలో హత్యలు, అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల 50కి పైగా దోపిడీలు, దొంగతనాలు జరిగినా, ఏ ఒక్క కేసులోనూ నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. జిల్లాలోకి ప్రవేశించే అనుమానిత వ్యక్తులను, అంతర్రాష్ర్ట దొంగలను ఏరివేసేందుకు ఇటీవల పోలీస్ యంత్రాంగం కార్డన్ సెర్చ్ పేరిట నిర్వహించిన తతంగం అంతా ఇంతా కాదు. అయితే ఈ కొత్త కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితమైందని ప్రజలు భావిస్తున్నారు. తాజాగా ఉండి గ్రామంలో జరిగిన చెయిన్ స్నాచింగ్ ఘటనలో కూడా ఇతర రాష్ట్రాల దొంగలు హల్చల్ చేయడం ప్రజల ఆరోపణలకు ఊతమిస్తోంది. అదే క్రమంలో మంగళవారం రాత్రి భీమడోలులో షట్టర్లు పగులగొట్టి బంగారు ఆభరణాల దుకాణం, బ్రాందీషాపులో జరిగిన దొంగతనాలలో పోలీసింగ్ డొల్లతనం బయటపడిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దొంగలు బాబోయ్ దొంగలు
Published Thu, Jan 22 2015 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement