తాడిపత్రిలో కాల్పుల కలకలం | Bullet Shots Heard From YSRCP Leader House | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో కాల్పుల కలకలం

Apr 12 2018 9:25 AM | Updated on Jun 1 2018 8:36 PM

Bullet Shots Heard From YSRCP Leader House - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిప్రత్తిలో వైఎస్సార్‌ సీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రమేష్‌ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్‌ లైసెన్స్‌ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్‌ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement