ఈతకెళ్లి బాలుడి మృతి | Boy dies while learning Swimming | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి బాలుడి మృతి

Jun 8 2015 4:15 PM | Updated on Jul 12 2019 3:02 PM

ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఒక బాలుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.

ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఒక బాలుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూర్ గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  తిప్పలూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ తన కుమారుడు విష్ణువర్థన్(8)కు ఈత నేర్పించాలని తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బావి దగ్గరకు వెళ్లిన తర్వాత వేణుగోపాల్ కుమారుడుని..  పై నుంచే బావిలోకి దూకమని, నేనూ నీ వెంటనే దూకుతానని ప్రోత్సహించాడు. దీంతో బాలుడు తండ్రి మాట విని బావిలో దూకాడు. అయితే బావిలో దూకిన బాలుడు అంతే మృతి చెందాడు. పై నుంచి బావిలో దూకడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బావిలో ఈత కొడుతున్న కొంతమంది గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement