గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైల్వే శాఖకు ఫోన్ చేసి చెన్నై-లాల్బాగ్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందని బెదిరించారు.
కుప్పం: గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైల్వే శాఖకు ఫోన్ చేసి చెన్నై-లాల్బాగ్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందని బెదిరించారు. దాంతో రైలును కుప్పం రైల్వేస్టేషన్లో నిలిపివేసి రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపుతో ప్రయాణికులు భయపడిపోయి తోచుకుంటూ రైలులో నుంచి కిందకు దూకారు.
ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తనిఖీలు అనంతరం రైలులో బాంబు ఏమీ లేదని తేలింది. ఎవరో తప్పుడు కాల్ చేశారని పోలీసులు చెప్పారు.