అంతర్జాలంతో జాగ్రత్త | Beware of internet | Sakshi
Sakshi News home page

అంతర్జాలంతో జాగ్రత్త

Dec 4 2013 3:24 AM | Updated on Sep 2 2017 1:13 AM

ప్రస్తుతం సైబర్ క్రైం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఖాతాల వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు

 బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ప్రస్తుతం సైబర్ క్రైం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఖాతాల వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. బంజారాహిల్స్ తాజ్‌దక్కన్ హోటల్‌లో మంగళవారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సేఫ్ సర్ఫింగ్ క్యాంపెయిన్’ అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ ప్రపంచంలో చిన్నారులకు సైబర్ బెదిరింపులు అంశంపై ప్రసంగించారు. అంతర్జాలంలో వ్యక్తిగత ఖాతాలను, నెంబర్లను మరింత భద్రంగా చూసుకోవాలని చెప్పారు. బ్యాంక్ ఖాతాలు, ఫేస్‌బుక్‌లు, వెబ్‌సైట్‌లలో పాస్‌వర్డ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని... ఎప్పటికప్పుడు వాటిని మార్చుకుంటే మంచిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య బాగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement