'ఐదు నెలల్లోనే భ్రష్టుపట్టిన టీడీపీ పాలన' | balineni srinivasa reddy slams tdp government | Sakshi
Sakshi News home page

'ఐదు నెలల్లోనే భ్రష్టుపట్టిన టీడీపీ పాలన'

Nov 2 2014 5:16 PM | Updated on Sep 2 2017 3:46 PM

బాలినేని శ్రీనివాసరెడ్డి(ఫైల్)

బాలినేని శ్రీనివాసరెడ్డి(ఫైల్)

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే టీడీపీ పాలన భ్రష్టుపట్టిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

ఒంగోలు: చంద్రబాబు హామీలను గాలికి వదిలేసి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే టీడీపీ పాలన భ్రష్టుపట్టిందని మండిపడ్డారు.

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. అశోక్ రెడ్డి నియామకాన్ని ఒంగోలులో బాలినేని అధికారికంగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement