చీరాల ఇన్‌చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని | Balineni Confirmed As Chirala YSRCP Incharge Amanchi Krishna Mohan | Sakshi
Sakshi News home page

చీరాల ఇన్‌చార్జి ఆమంచే.. స్పష్టం చేసిన బాలినేని

Jan 29 2020 8:09 AM | Updated on Jan 29 2020 8:09 AM

Balineni Confirmed As Chirala YSRCP Incharge Amanchi Krishna Mohan - Sakshi

ఆమంచి కృష్ణమోహన్‌ 

సాక్షి, ఒంగోలు: చీరాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక మీదట కూడా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలన్నీ ఆమంచి నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకూ తావు లేదని పునరుద్ఘాటించారు. ఆమంచి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement