పెడనలో రూ.50కే అత్తారింటికి దారేది సీడీ
పెడన : పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కొత్త సినిమా విడుదలకు ముందే మార్కెట్లో ప్రత్యక్షం అయ్యింది. కృష్ణా జిల్లా పెడనలో ఈ సినిమా పైరసీ సీడీ రూ.50కే లభ్యం అవుతోంది. పైరసీ సీడీలపై సమాచారం అందుకున్న పోలీసులు సీడీ షాపులు, సెల్ఫోన్ రిపేర్ షాపుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పైరసీపై చిత్ర నిర్మాతలు డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సుమారు 90 నిముషాలు నిడివి గల చిత్రం పైరసీ సీడీలో హల్చల్ చేస్తోంది. పైరసీ భూతం మరోసారి చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పైరసీ సీడీల్లో లభిస్తున్నట్లు సమాచారం.