సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో రాజుల కోటలు కుప్పకూలాయి. రాజ వంశాలకు చెందిన పలువురు సామాన్యుల చేతిలో మట్టి కరిచారు. విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన విజయనగర రాజవంశానికి చెందిన అశోకగజపతి రాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అదితి, అరకు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కురుపాం రాజు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన బొబ్బిలి రాజ వంశానికి చెందిన సుజయకృష్ణ రంగారావు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో బొబ్బిలి రాజవంశానికి చెందని సుజయకృష్ణ రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తరఫున విజయం సాధించారు. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య వైరం ఈనాటి కాదు. కానీ సుజయకృష్ణా రంగరావును టీడీపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. మంత్రి వర్గంలో సైతం చేర్చుకుని గనుల శాఖను కట్టబెట్టారు.
చంద్రబాబు సూచనల మేరకు బొబ్బిలి రాజులతో శతాబ్ధాల వైరాన్ని అశోక్గజపతిరాజు పక్కన పెట్టారు. బొబ్బిలి, విజయనగర రాజ వంశాలకు చెందిన కుటుంబాలు టీడీపీ తరఫున ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. విజయనగరం లోక్సభ స్థానం నుంచి అశోక్గజపతి రాజును టీడీపీ మళ్లీ బరిలోకి దించింది. బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు పోటీ చేయగా, అశోక్గజపతి రాజు కూతరు అదితి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దిగారు. కురుపాం రాజా వైరిచర్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి అరకు లోక్సభ స్థానం టికెట్ సాధించుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ముందు రాజులు నిలబడలేకపోయారు. విజయనగరం లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిని కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజును వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ చిత్తు చిత్తుగా ఓడించి.. జెయింట్ కిల్లర్గా అవతరించారు. అరకు లోక్సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్లపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థి గొడ్డేటి మాధవి భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొబ్బిలి శాసనసభ స్థానంలో సుజయకృష్ణ రంగారావును శంబంగి అప్పలనాయుడు, విజయనగరం శాసనభ స్థానంలో అదితిని కోలగట్ల వీరభద్రస్వామి మట్టికరిపించారు.
కుప్పకూలిన కోటలు
Published Fri, May 24 2019 5:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement