సాక్షి ప్రతినిధి, కర్నూలు: అపార్టుమెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కెపాసిటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సామర్థ్యాన్ని బట్టి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భారం పడనుంది. అయితే, విద్యుత్ వృథాను అరికట్టేందుకే ఈ రకమైన చర్యలను చేపడుతున్నామని విద్యుత్శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం అపార్టుమెంట్ వాసులే కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించి.. తద్వారా ట్రాన్స్ఫార్మర్లు పదే పదే ట్రిప్ కాకుండా అరికట్టేందుకు కెపాసిటర్లు ఉపయోగపడతాయనేది విద్యుత్ శాఖ అధికారుల భావన. ఇందులో భాగంగా కేవలం అపార్టుమెంట్లకే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి విద్యుత్శాఖ సూచనలు చేసింది. కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు సమర్థవంతంగా విద్యుత్ను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మునిసిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలోని తాగునీటి పథకాలకూ వీటిని బిగించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా మునిసిపాలిటీలు, పంచాయతీ లుచర్యలు తీసుకోవాలని సూచించింది.
వ్యవసాయ మోటార్లకూ ఏర్పాటు
కెపాసిటర్ల వినియోగాన్ని వ్యవసాయ మోటార్లకూ తప్పనిసరి చేయాలని ఇప్పటికే విద్యుత్శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులకు జిల్లా విద్యుత్శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే, కెపాసిటర్లకు అయ్యే మొత్తాన్ని రైతులు భరించుకోవాల్సి ఉంటుందా? విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లే భరిస్తాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
మోత
Published Sun, Jul 19 2015 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది
పోలింగ్ సమయం గంట పెంపు
పాంచ్ న్యాయ్తో అన్ని వర్గాలకు న్యాయం
9 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు
ప్రశాంతంగా నీట్
మట్టి మాయగాళ్లు
మీటర్ మోగుతోంది!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement