ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం | AP & Telangana: Six new High Court Judges take oath | Sakshi
Sakshi News home page

ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణం

Sep 21 2017 10:40 AM | Updated on Sep 22 2017 10:02 AM

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఆరుగురు... గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఆరుగురు... గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సమక్షంలో దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్‌) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్‌ గంగారావు, అభినంద్‌కుమార్‌ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన న్యాయమూర్తులకు పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా టి.అమర్‌నాథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ... హైకోర్టు జడ్జిగా ఎంపిక కావటం ఆనందంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిదన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన గురువు అయిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేలా కృషి చేస్తానని అమర్‌నాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్త...

ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement