వెనకబడిన తరగతులకు రూ.10 వేలు ఆర్థిక సాయం

AP Government Will Be Starts Jagananna Chedodu Programme - Sakshi

సాక్షి, అమరావతి: నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ప్రతి ఏడాది రూ. 10వేల చొప్పున అందిచాలని సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top