చంద్రబాబుతో డీజీపీ భేటీ

AP DGP RP Thakur Met CM Chandrababu Naidu In Amaravati - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడితో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేతాలు సమావేశం అయ్యారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు వారాల్లోగా నోటీసులకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. వైఎస్‌ జగన్‌ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సంబంధిత కోర్టులో తుది చార్జిషీట్‌ దాఖలు చేయవద్దని కూడా పోలీసులకు స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top